దోహాలో త్వరలోనే ఎంబసీ కార్యాలయం పునరుద్ధరణ...సౌదీ ప్రకటన
- January 17, 2021రియాద్:దోహాలో త్వరలోనే రాయబార కార్యాలయాన్ని రీఓపెన్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అవసరమైన చర్యలు పూర్తి అయిన వెంటనే కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ వెల్లడించారు. అల్ ఉలా ఒప్పందం తర్వాత తీసుకుంటున్న సానుకూల నిర్ణయాల్లో భాగంగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖతార్ తో జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మాన్ సఫాది తో కలిసి ఆయన రియాద్ ఈ ప్రకటన చేశారు. పాలస్తీనా వివాదానికి సమగ్ర పరిష్కారం పొందాల్సిన అవసరాన్ని సౌదీ మంత్రి పునరుద్ఘాటించారు. ఇదిలాఉంటే..జోర్డాన్ మంత్రి మాట్లాడుతూ...సౌదీతో మైత్రి చారిత్రాత్మకమైనది అభివర్ణించారు. ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ మైత్రి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సౌదీపై హౌతి మిలిషియా దాడి ప్రయత్నాలను సఫాది ఖండించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్