3 నెలల్లో దేశం విడిచి వెళ్ళిన 83,000 మంది వలసదారులు
- January 18, 2021కువైట్: 2020 మూడో త్రైమాసికానికి సంబంధించి వెలుగు చూసిన తాజా గణాంకాల ప్రకారం మొత్తం 83,574 మంది వలసదారులు దేశం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలివి. దీంతో, లేబర్ మార్కెట్లో ప్రస్తుతం వర్క్ ఫోర్స్ 1.5 మిలియన్లకు తగ్గింది. ప్రభుత్వ ఏజెన్సీల్లో 29 శాతం మంది కంటే తక్కువ వలసదారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 65 శాతం మంది ఎడ్యకేషన్ హెల్త్ తదితర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. కాగా, బిజినెస్ సెక్టార్లో కువైటీల సంఖ్య 4,248కి పెరిగింది. డొమెస్టిక్ వర్కర్స్ విభాగంలో తగ్గుదల గణనీయంగా కనిపించింది. మొత్తం 7385 మంది డొమెస్టిక్ వర్కర్స్ తగ్గారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..