ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..
- April 25, 2021టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య ఇకలేవరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఫణిగిరి. వీరయ్య సతీమణి మల్లిక 2008లోనే మరణించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1969లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా మరుగుజ్జు నటుడిగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు వీరయ్య. అనంతరం దాసరి ప్రోత్సాహంతో 'తాత మనవడు' సినిమాలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిపి ఇప్పటి వరకు 500లకు పైగా సినిమాల్లో నటించారు వీరయ్య. తనదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అగ్గివీరుడు, తాత మనవడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్ సుందరి వంటి ఎన్నో చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు