మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్
- October 14, 2022
న్యూ ఢిల్లీ: మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం అర్ధరాత్రి ఇ-మెయిల్ వచ్చింది. ఈ విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది.
అప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 400 మంది ప్రయాణికులు ఉన్నారు. అనుమానాస్పద వస్తువులేమీ కన్పించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్లో ఉంచామని అన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..