మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్

- October 14, 2022 , by Maagulf
మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్

న్యూ ఢిల్లీ: మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం అర్ధరాత్రి ఇ-మెయిల్‌ వచ్చింది. ఈ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యింది.

అప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 400 మంది ప్రయాణికులు ఉన్నారు. అనుమానాస్పద వస్తువులేమీ కన్పించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచామని అన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com