మలేషియా చేరుకున్న వెంకయ్యనాయుడు

- October 14, 2022 , by Maagulf
మలేషియా చేరుకున్న వెంకయ్యనాయుడు

కౌలాలంపూర్: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆరు రోజుల పాటు మలేషియా,సింగపూర్ ల లో పర్యటిస్తున్నారని విషయం తెలిసిందే.ఈ రోజు ఉదయం కౌలాలంపూర్ చేరుకున్నారు. 

శనివారం జరగబోయే మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఈరోజు మలేషియా విచ్చేసారు.ఈ కార్యక్రమం మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.  

ఇందులో భాగంగా ఈరోజు మలేషియా విచ్చేసిన వెంకయ్యనాయుడు కి మలేషియా లో భారత హైకమీషనర్ B.N రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.ఇందులో సీనియర్ ప్రభుత్వ అధికారులు, భారతీయ మరియు తెలుగు ప్రవాసులకు చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు.ఆ తరువాత రావాంగ్ లోని తెలుగు సాంస్కృతిక నిలయం, మలేషియా తెలుగు అకాడెమిని సందర్శించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com