ఆన్ లైన్ మోసాల పట్ల బి అలర్ట్-సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్
- October 14, 2022
మనమా: ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ కు చెందిన యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రజలకు సూచించింది. చాలా మంది మోసపూరిత కాల్స్ చేస్తూ ఓటీపీ షేర్ చేయాలని అడుగుతున్నారని సూచించారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది.ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగదారుల పాస్వర్డ్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకులు కాల్స్, మెసేజ్ ల ద్వారా పాస్ వర్డ్ లు అడగవని...అలా ఎవరైనా అడిగితే అది మోసపూరితమైన కాల్స్ అని గుర్తించాలని అన్నారు. మోసపూరిత కాల్స్ వస్తే హాట్లైన్ 992కి కాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







