రష్మికను బ్యాన్ చేస్తే వాళ్లకే నష్టం అంటోన్న డైరెక్టర్.!

- November 30, 2022 , by Maagulf
రష్మికను బ్యాన్ చేస్తే వాళ్లకే నష్టం అంటోన్న డైరెక్టర్.!

ఏరు దాటాకా, తెప్ప తగిలేయడం అంటారు కదా.. ఆ తరహా కామెంట్లే ప్రస్తుతం రష్మికపై వినిపిస్తున్నాయ్. కన్నడ సినిమా ‘కిర్రిక్ పార్టీ’తో రష్మిక హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమానే రష్మికకు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చింది.
రష్మిక పేరు కన్నడలోనే కాదు, తెలుగులోనూ మార్మోగిపోవడానికి కారణం ఆ సినిమానే. అయితే, ఆ ప్రస్థావన తీసుకురావడానికి రష్మిక అస్సలు ఇష్టపడడం లేదు ఇప్పుడు.
దాంతో, కన్నడిగులు రష్మికపై గుస్సా అవుతున్నారు. ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్‌గా సంచలనాలు నమోదు చేసిన ‘కాంతార’ సినిమా కూడా రష్మికపై కన్నడిగుల గుస్సాకి కారణం. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాని రష్మిక చూడలేదని చెప్పడం వివాదాలకు కారణమైంది. 
తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ నాగశేఖర్ ఈ విషయంపై స్పందించాడు. రష్మికను బ్యాన్ చేస్తే కన్నడ పరిశ్రమకే నష్టం. అయినా కృతజ్ఞతను ఆశిస్తే ఎప్పుడోకప్పుడు ఇలాగే బాధపడాల్సి వస్తుంది. సాయాన్ని గుర్తు పెట్టుకోవడం.. గుర్తుపెట్టుకోకపోవడం అనేది సాయం పొందిన ఆయా వ్యక్తుల వ్యక్తిగతం అని ఆయన వ్యాఖ్యానించారు. 
ప్రస్తుతం రష్మిక, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. అలాగే బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com