ఇంధన ధరల ఎఫెక్ట్: టాక్సీ ఛార్జీలను పెంచిన అజ్మాన్ అథారిటీ
- February 02, 2023
యూఏఈ: యూఏఈ లో ఫిబ్రవరి నెలలో పెరిగిన ఇంధన ధరల ప్రభావం టాక్సీ ఛార్జీలపై పడింది. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా టాక్సీ ఛార్జీలను సవరించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.2023 ఫిబ్రవరి నెలలో ప్రయాణీకుల వద్ద కిలోమీటరుకు 1.83 దిర్హామ్లు వసూలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గత నెలలో ఇది కిలోమీటరుకు 1.78 దిర్హామ్లుగా ఉంది. యూఏఈలో ఈనెల ఇంధన ధరలు లీటరుకు 27 ఫిల్స్ వరకు పెరిగాయి. సూపర్ 98 ధర లీటరుకు Dh0.27 లేదా 9.7 శాతం పెరిగి Dh3.05కి చేరింది. ప్రత్యేక 95 ధర Dh0.26 లేదా 9.7 శాతం Dh2.93కి పెరిగింది. E-ప్లస్ ధర Dh0.27 లేదా 10.4 శాతం పెరిగి లీటరు Dh2.86 చేరుకుంది.
తాజా వార్తలు
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!







