ఇంధన ధరల ఎఫెక్ట్: టాక్సీ ఛార్జీలను పెంచిన అజ్మాన్ అథారిటీ

- February 02, 2023 , by Maagulf
ఇంధన ధరల ఎఫెక్ట్: టాక్సీ ఛార్జీలను పెంచిన అజ్మాన్ అథారిటీ

యూఏఈ: యూఏఈ లో ఫిబ్రవరి నెలలో పెరిగిన ఇంధన ధరల ప్రభావం టాక్సీ ఛార్జీలపై పడింది. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా టాక్సీ ఛార్జీలను సవరించినట్లు అజ్మాన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.2023 ఫిబ్రవరి నెలలో ప్రయాణీకుల వద్ద కిలోమీటరుకు 1.83 దిర్హామ్‌లు వసూలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గత నెలలో ఇది కిలోమీటరుకు 1.78 దిర్హామ్‌లుగా ఉంది. యూఏఈలో ఈనెల ఇంధన ధరలు లీటరుకు 27 ఫిల్స్‌ వరకు పెరిగాయి. సూపర్ 98 ధర లీటరుకు Dh0.27 లేదా 9.7 శాతం పెరిగి Dh3.05కి చేరింది. ప్రత్యేక 95 ధర Dh0.26 లేదా 9.7 శాతం Dh2.93కి పెరిగింది. E-ప్లస్ ధర Dh0.27 లేదా 10.4 శాతం పెరిగి లీటరు Dh2.86 చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com