ఒమన్ లో పర్యటిస్తున్నభారత నావికాదళ అధిపతి
- August 01, 2023
మస్కట్: ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు, ఒమన్ సైనిక నాయకత్వంతో ఉన్నత స్థాయి చర్చల కోసం భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మూడు రోజుల ఒమన్ పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో నావల్ స్టాఫ్ చీఫ్, రాజ కార్యాలయ మంత్రి జనరల్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్-నుమానీని కలిశారు. ఒమన్ రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసర్ బిన్ మొహసేన్ అల్-రహ్బీ మరియు ఒమన్ రాయల్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ మటర్ బిన్ సలీం బిన్ రషీద్ అల్ బలూషితో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అతను ఒమన్లోని కీలక రక్షణ, శిక్షణా సంస్థాపనలను కూడా సందర్శించనున్నారు.
అంతకుముందు ఆదివారం మస్కట్ చేరుకున్న నేవల్ చీఫ్ కు ఒమన్ రాయల్ నేవీ కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసిర్ బిన్ మొహ్సిన్ అల్-రహ్బీ , ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ స్వాగతం పలికారు. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సందర్శన సందర్భంగా స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ INS విశాఖపట్నం మస్కట్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్ వద్దకు చేరుకుంది. ఒమన్ రాయల్ నేవీతో వివిధ నావికా సహకార కార్యక్రమాలు ఆగస్ట్ 3న ముగియనున్న మారిటైమ్ పార్టనర్షిప్ ఎక్సర్ సైజులో ఇది పాల్గొంటుంది.
తాజా వార్తలు
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!