చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది..

- June 07, 2016 , by Maagulf
చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది..

నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8.30గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తొలుత ప్రకటించినప్పుటికీ అర్థగంట ముందే పంపిణీ ప్రారంభించారు. 32 కేంద్రాల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. చేప ప్రసాదం పంపిణీలో 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8.30గంటల వరకు ఎగ్జిబిషన్‌ మైదానంలో చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి దాతలు భోజనం, నీటి వసతి ఏర్పాటు చేశారు.
ఎగ్జిబిషన్‌ మైదానంలోకి బయటి వాహనాలకు అనుమతి నిరాకరించారు. మైదానం వద్ద ఇవాళ, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com