తమన్నా బాటలో రష్మిక మండన్నా
- June 29, 2024
హారర్ కామెడీ చిత్రాలకు మంచి క్రేజ్ వుందిప్పుడు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు ఈ జోనర్లో నటించేందుకు ముందుకొస్తున్నారు. ఆల్రెడీ తమన్నా తదితరులు ఈ జోనర్లో వరుసగా ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నారు.
ఇక, ఇప్పుడు రష్మిక వంతొచ్చింది. ప్యాన్ ఇండియా హీరోయిన్గా చెలామణీ అవుతోన్న రష్మిక త్వరలో ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతోందట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం స్ర్కిప్టు దశలో వున్న ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్నగర్’ అనే టైటిల్ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. యూనిక్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీతో పాటూ తెలుగు తదితర భాషల్లోనూ విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటూ పలు క్రేజీ ప్రాజెక్టులతో శ్రీవల్లి రష్మిక బిజీగా వుంది. ఇటీవలే ‘పుష్ప 2’ నుంచి వచ్చిన సాంగ్లో రష్మిక సిగ్నేచర్ స్టెప్పులు ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









