తమన్నా బాటలో రష్మిక మండన్నా
- June 29, 2024
హారర్ కామెడీ చిత్రాలకు మంచి క్రేజ్ వుందిప్పుడు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు ఈ జోనర్లో నటించేందుకు ముందుకొస్తున్నారు. ఆల్రెడీ తమన్నా తదితరులు ఈ జోనర్లో వరుసగా ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నారు.
ఇక, ఇప్పుడు రష్మిక వంతొచ్చింది. ప్యాన్ ఇండియా హీరోయిన్గా చెలామణీ అవుతోన్న రష్మిక త్వరలో ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతోందట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం స్ర్కిప్టు దశలో వున్న ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్నగర్’ అనే టైటిల్ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. యూనిక్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీతో పాటూ తెలుగు తదితర భాషల్లోనూ విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటూ పలు క్రేజీ ప్రాజెక్టులతో శ్రీవల్లి రష్మిక బిజీగా వుంది. ఇటీవలే ‘పుష్ప 2’ నుంచి వచ్చిన సాంగ్లో రష్మిక సిగ్నేచర్ స్టెప్పులు ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!
- అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర సమావేశం..!!
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్









