తమన్నా బాటలో రష్మిక మండన్నా
- June 29, 2024
హారర్ కామెడీ చిత్రాలకు మంచి క్రేజ్ వుందిప్పుడు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు ఈ జోనర్లో నటించేందుకు ముందుకొస్తున్నారు. ఆల్రెడీ తమన్నా తదితరులు ఈ జోనర్లో వరుసగా ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నారు.
ఇక, ఇప్పుడు రష్మిక వంతొచ్చింది. ప్యాన్ ఇండియా హీరోయిన్గా చెలామణీ అవుతోన్న రష్మిక త్వరలో ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతోందట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం స్ర్కిప్టు దశలో వున్న ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్నగర్’ అనే టైటిల్ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. యూనిక్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీతో పాటూ తెలుగు తదితర భాషల్లోనూ విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటూ పలు క్రేజీ ప్రాజెక్టులతో శ్రీవల్లి రష్మిక బిజీగా వుంది. ఇటీవలే ‘పుష్ప 2’ నుంచి వచ్చిన సాంగ్లో రష్మిక సిగ్నేచర్ స్టెప్పులు ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







