గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- January 21, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మళ్లీ మొదలుపెట్టిన ప్రజా పాలన దరఖాస్తులలో భాగంగా నేటి నుండి గ్రామ సభలు ప్రారంభం అయ్యాయి.రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల జాబితాలో పేరు లేని లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది.ఈ సభలలోనే నాలుగు పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.ఈ సందర్భంగా మహేశ్వరం జోన్ పరిధిలోని రావిరాల, జల్పల్లి లేమూరు గ్రామసభల సమావేశాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గ్రామ సభలలో పాల్గొనే ప్రజలకు,దరఖాస్తులు పెట్టుకునే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు డిసిపి సునీత రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు .
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!